జర్నలిస్ట్ జమీర్ మృతి విషాదకరం టి పి సి సి నాయకులు జువ్వాడి కృష్ణారావు
Published: Saturday July 16, 2022
కోరుట్ల, జూలై 15 ( ప్రజాపాలన ప్రతినిధి ):
జగిత్యాల జిల్లా కు చెందిన ఎన్టీవీ విలేకరి జమీర్ వరద ప్రమాదం లో చిక్కుకొని మరణించడం అత్యంత బాధాకరం అని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.శుక్రవారం రోజున స్థానిక పత్రికా ప్రదినిధులతో మాట్లాడుచు ఇటీవల కురిసిన వర్షాలతోరాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామం సమీపం లోని గోదావరి నది ప్రవాహం మధ్యలోచిక్కుకున్న వ్యవసాయకూలీలకు సంబందించిన వార్త సేకరణ కోసం వెళ్తురాయికల్ మండలం రామాజీ పెట భూపతి పూర్ గ్రామల మధ్యలో ఉన్న కల్వర్టు వద్ద వరద ప్రవాహం లో చిక్కుకొని జమీర్ మరణించడము తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు విధి నిర్వహనలో మృతి చెందిన జమీర్ ది సాధారణ మరణం కాదని విధి నిర్వహినకోసం ప్రాణ త్యాగం చేశాడని అన్నారు జర్నలిస్ట్ కుటుంబసభ్యులకు భగవంతుడు ఈ సమయం లో తగిన మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రభుత్వం మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబం కు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు
Share this on your social network: