ఆరోగ్యలక్ష్మి యాప్ పై అంగన్వాడీలకు అవగాహన

Published: Wednesday February 16, 2022
మధిర ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలో మంగళవారం నాడు అంగన్వాడి టీచర్లకు ఆరోగ్య లక్ష్మీ యాప్ పై మంగళవారం స్థానిక ఐసిడిఎస్  కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ శారదా శాంతి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, కచ్చితంగా బరువు, ఎత్తులను వేయాలని ఆమె కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా తెలియజేయాలని అని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పర్సనల్ సిడిపిఓ వీరభద్రమ్మ పాల్గొన్నారు.