చర్ల పటేల్ గూడెంలో స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
Published: Friday September 17, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్ గూడ గ్రామంలో వంద శాతం కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ స్పెషన్ డ్రైవ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ వేయించుకోవడానికి గ్రామ ప్రజలు భారీగా గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు తరలి వచ్చి టీకాలను వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, వైస్ ఎంపీపీ మంచి రెడ్డి ప్రతాపరెడ్డి, జడ్పిటిసి భూపతి గళ్ల మహిపాల్, సర్పంచ్ కంబాలపల్లి గీత రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేందర్ వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యుడు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: