పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ సింధుశర్మ

Published: Monday November 01, 2021

జగిత్యాల, అక్టోబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల సైబర్ మోసానికి గురి అయితే 100 లేదా 155260 డయల్ చేయాలని తక్షణమే ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న కేసులన్ని తక్షణమే పరిష్కరించాలని  జిల్లా ఎస్పీ సిందూశర్మ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పట్ల నిఘా పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అడ్మిన్ ఎస్పీ కె. సురేష్ కుమార్ డీఎస్పీ లు ప్రకాష్ రవీందర్ రెడ్డి డీసీఆర్బీ డీఎస్పీ రాఘవేంద్రరావు ఏవో చంద్ర మోహన్ ఎస్భి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ మరియు సిఐలు ఎస్ఐలు  పాల్గొన్నారు.