పాఠశాల విద్యార్థులకు వ్యాక్సినేషన్ వేయించిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు

Published: Friday January 07, 2022
బోనకల్, జనవరి 6 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని అళ్లపాడు గ్రామంలో కూరకుల వేంకయ్య ఐ ఎఫ్ ఎస్ ప్రాథమిక పాఠశాల నందు 15 నుండి 17 సంవత్సరాల విద్యార్థులకు కరోనా, ఓమిక్రాన్ పట్ల జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్ వేయించేందుకు సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆధ్వర్యంలో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా బోనకల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకోని వచ్ఛి పాఠశాల విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు రమేష్, పి ఈ టి మాదవ రావు, బోనకల్ ఏఎన్ఎం సరస్వతి, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, బోనకల్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.