భారత కీర్తి పురస్కారం అందుకున్న నాశబోయిన నరసింహ (నాన)

Published: Tuesday August 17, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ప్రజాపాలన ప్రతినిది వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తించే ఆరోగ్య పర్యవేక్షకుడు కవి, రచయిత, నాశబోయిన నరసింహ(నాన)కు ఆదివారం సాహితీ రచన చేసినందుకు గాను భారత కీర్తి పురస్కారం వరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా తెలుగు కవి - కవిత రచన సాహితీ సంస్థ వారు స్వాతంత్ర సమర యోధులు అంశం పై నిర్వహించిన కవితా పోటీలో పాల్గొని ఉత్తమ కవితా రచన చేసినందుకు గాను 'భారత కీర్తి పురస్కారం'ను అంతర్జాల వేదిక ద్వారా ఆ సంస్థ అధ్యక్షులు ఇంద్రావత్ రాహుల్ అందజేశారని నరసింహ తెలిపారు. భారత కీర్తి పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా పలువురు సాహితీ స్నేహితులు, సహచర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు నరసింహని అభినందించారు.