మండలం లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు.
Published: Thursday January 27, 2022
జన్నారం రూరల్ జనవరి 26 ప్రజాపాలన : భారత గణతంత్ర 73వ దినోత్సవం వేడుకల్ని బుధవారం మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తాహశిల్థార్ కార్యాలయంలో తాహాసిల్దార్ పుష్పలత త్రీవర్ణ పథకం ఆవిష్కరించారు, స్థానిక పోలీసులు స్టేషన్ లో ఎస్ఐ పి.సతీష్, అటవిశాఖ డివిజన్ కార్యాలయంలో ఎప్డిఓ మాదవరావు జాతీయ జేండా ఆవిష్కరించారు. అదేవిధంగా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, సర్పంచ్ ల సంఘం మండల అద్యక్షు డు జాడి గంగాధర్, రాంపూర్ ఎంపిటిసి దర్శనాల వెంకటస్వామి, టిఆర్ ఎస్ పార్టీ గ్రామ అద్యక్షుడు చిందం చంద్రయ్యలు పాల్గొన్నారు. అదేవిధంగా మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ లలో, అంగన్వాడీ కేంద్రాలలో, కులసంఘాల కార్యాలయాల్లో, వివిధ రాజకీయ పార్టీలనాయకులు వారి కార్యాలయాలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
Share this on your social network: