బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ

Published: Friday December 16, 2022

శంకరపట్నం డిసెంబర్ 15 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామానికి చెందిన  చలిగంటి మల్లయ్య అనారోగ్య కారణంతో ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని ఈరోజు మాది హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు సముద్రాల సంపత్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మల్లయ్య కుటుంబ సభ్యులు వంకాయ గూడెం లోని అయ్యప్ప  దేవస్థానంలో పని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ పేద కుటుంబానికి ఈరోజు సముద్రాల సంపత్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని  పంపిణీ  చేస్తూ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిష్ వాసు ,ఆరెపల్లి తిరుపతి, శ్రీకాంత్,  మల్లయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు