శంకరపట్నంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం శంకరపట్నం మార్చి 29 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday March 30, 2023

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఎగరవేసి, జై తెలుగుదేశం అనే నినాదాలతో ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండి సాబీర్, బొంగోని చందు, గోపు వీరమల్లు, సముద్రాల సంపత్, బూర్ల కొమురయ్య, గుర్రం బుచ్చయ్య, కదిరే కొమురయ్య, బొంగోని శ్రీనివాస్, ఊకంటి బాబు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.