వంగవీడు యుపిఎస్ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ*మధిర

Published: Tuesday June 21, 2022
రూరల్ జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడువంగవీడు ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఈరోజు వంగవీడు గ్రామానికి చెందిన ఓబుల లక్ష్మారెడ్డి లలిత దంపతులు 10 వేలు రూపాయల విలువచేసే నోటు పుస్తకాలను అందజేశారు అదేవిధంగా ఓబుల ప్రతాపరెడ్డి  రెండు వేల రూపాయలు విలువ చేసే రాతపుస్తకాలు వితరణగా అందజేశారు.ఈ కార్యక్రమంలో వంగవీడు గ్రామ సర్పంచ్ బొగ్గుల.పద్మావతి  , ఎంపీటీసీ అయిలూరి .రామకోటమ్మా, SMC చైర్ పర్సన్ మూడు. సత్యంబాబు , గ్రామ కార్యదర్శి .రాకేష్ మరియు గ్రామ పెద్దలు వీరా రెడ్డి , జనార్ధనరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు Ch. సత్యనారాయణ రెడ్డి  ,మరియు పాఠశాల ఉపాధ్యాయుబృందం పాల్గొన్నారు.