అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్

Published: Thursday July 01, 2021

బెల్లంపల్లి, జూన్ 30, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మండలం బూదాకలాన్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సూచనలు చేసిన మంచిర్యాల అసిస్టెంట్ కలెక్టర్ ఐలాత్రిపాఠి. బుధవారం నాడు బెల్లంపల్లి మండలంలోని భూద కలాన్, మత్తమారి గూడెం గ్రామాలలో పర్యటించి స్థానిక స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులను ఆదేశించారు, అనంతరం మండలంలో ఏర్పాటు చేయబోయే పార్కు కు సంబంధించిన పది ఎకరాల స్థలాన్ని శివాలయం దగ్గర పరిశీలించడం జరిగింది, ఈ కార్యక్రమంలో  ఎం పి డి ఓ, ఎం పి ఓ, ఏ పీ ఓ, సర్పంచ్ కోట లక్ష్మి, గ్రామ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.