జిల్లా వాసి బంగారు పతకం సాధించడం అభినందనీయం : జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
Published: Tuesday November 16, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 15, ప్రజాపాలన : నిర్మల్ జిల్లా బాసరలో ఈ నెల 1, 2 తేదీలలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో జిల్లా వాసి బంగారు పతకం సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టర్ చాంబర్లో ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 70 కేజీల విభాగంలో బంగారు . పతకం సాధించిన బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన రానకొండ నంజీవ్ ను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలలో యువత రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకో వడంతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
Share this on your social network: