పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శివాలయంలో అన్నదానం మధిర రూరల్ ఆగస్టు 29

Published: Tuesday August 30, 2022
 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడుసీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతుల కుమారుడు మల్లు విక్రమాదిత్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో శివాలయంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లు విక్రమాదిత్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు.  పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిర్యాల రమణ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోన ధని కుమార్ పారుపల్లి విజయ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు కోరం పల్లి చంటి డేవిడ్ రమణ తదితరులు పాల్గొన్నారు