నులి పురుగులను నులిపేద్దాం

Published: Friday September 16, 2022
మధిర సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి
మున్సిపల్ పరిధిలో గురువారం నాడు
స్థానిక హరిజన వాడ హైస్కూల్లో విద్యార్థులకు  దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు  శశిధర్ ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన మాత్రలను మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత విద్యార్థులను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు అపరిశుభ్ర ఆహారము తీసుకోవటం వల్ల విద్యార్థల ప్రేగుల్లోకి చేరి విద్యార్థులను అనారోగ్యానికి గురి చేస్తుందని ఆమె అన్నారు.  ఈ మాత్రలను నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని అంగన్వాడి సెంటర్స్, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ వైద్య సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుందని విద్యార్థులందరూ  ఆహారము తీసుకున్న తర్వాత ఆల్బెండజోల్ 400ఎంజి చప్పరించి నవిలి మింగాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గద్దల మాధురి వైద్య సిబ్బంది గోవిందు లంకా కొండయ్య తదితరులు పాల్గొన్నారు