ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

Published: Friday February 17, 2023

జన్నారం, ఫిబ్రవరి 16, ప్రజాపాలన: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహించామని ఎంఈఓ విజయ్ కుమార్ అన్నారు. గురువారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండలంలోని 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలలో ఇద్దరు ఎంపికయ్యాన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మంచిర్యాల జిల్లా స్థాయిలో ఈనెల 22న పోటీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు