క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణ

Published: Friday October 29, 2021

జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణంలోని బైపాస్ రోడ్డు లో నలంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్-జాతీయ సేవా పథకం లో భాగంగా క్లీన్ ఇండియా కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటి 6వ సెమిస్టర్ పరీక్షలలో 10/10  జిపిఎ సాధించిన 6 గురు నలంద కాలేజ్ విద్యార్థులను అభినందించి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పారతో డ్రైనేజీలో చెత్త మరియు ప్లాస్టిక్ లను తొలగించినారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు గుగ్గిళ్ల హరీష్, క్యాదాసు నవీన్, కొలగాని ప్రేమలత, పంబాల రాము, బొడ్ల జగదీష్, అల్లే గంగసాగర్, కరస్పాండెంట్ నరేష్, నాయకులు, అల్లాల అనంద్ రావ్, డిష్ జగన్, దూమల రాజ్ కుమార్, ఒద్ది రామ్మోహన్, కళాశాల యాజమాన్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.