ఇద్దరికి కారుణ్య ఉద్యోగాలు
Published: Wednesday October 13, 2021
వికారాబాద్ బ్యూరో 13 అక్టోబర్ ప్రజాపాలన : జిల్లా పరిషత్ నుంచి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి ఇద్దరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. మరొకరికి పదోన్నతి కల్పిస్తూ ముగ్గురికి ఉత్తర్వు కాపీలను అందజేశారు. వీరిలో శ్రీరాములుకు జడ్పిలో అటెండర్ గా, శ్రీనివాస్ కు వాచ్ మెన్ గా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. అలాగే తాజోద్దీన్ కు దోమలో జిల్లా పరిషత్ హై స్కూల్ జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వుల కాపీలను అందజేశారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
Share this on your social network: