*అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయాస్తమాన పూజలు*

Published: Friday December 16, 2022

మధిర డిసెంబర్ 15 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో గురువారం జరిగిన ఉదయాస్తమాన పూజల్లో పెండ్యాల కాశిరావు దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెండ్యాల కాశీరావు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి దేవిశెట్టి రంగారావు పుల్లారావు గాంధీ సుబ్బారావు శ్రీనివాసరావు స్వామి  స్వామి మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, గాంధీ స్వామి ఎంఆర్సి రావు స్వామి తదితరులు పాల్గొన్నారు.