జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా. బూర్గంపాడు.( ప్ర

Published: Tuesday January 03, 2023

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు . సోమవారం నాడు సందర్శించి పాఠశాలల్లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను వారు సందర్శించడం జరిగింది., అదేవిధంగా అక్కడ జరుగుతున్న పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసేందుకు మన ఊరు మనబడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనూ బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుంది అన్నారు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి  ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నదని అన్నారు, ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.