ప్రధాన రహదారి ప్రక్కన పొంచి ఉన్న ప్రమాదం

Published: Monday February 13, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 11 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే  వివిధ అవసరాల నిమిత్తం తవ్విన గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో అది వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల రాత్రి వేళలో వాహనదారులు ఎలాంటి సూచిక బోర్డులు  లేకపోవడం వలన ఇది పెను ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని  వాహనదారులు వాపోయారు. ఇప్పటికైనా అతి త్వరగా ఈ గుంతను పూడ్చి వాహనదారుల ఇబ్బంది లేకుండా చూడాలని  వాహనదారులు అభిప్రాయపడ్డారు.