5 నుంచి సమ్మె కు దిగుతాం. వీఆర్ఎలు

Published: Wednesday July 13, 2022
పాలేరు జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
వీఆర్ఎ ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ నెల 25 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు సంఘం నాయకులు పసుపులేటి సైదులు హెచ్చరించారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కు సమ్మె నోటీస్ ను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. దశల వారీగా ఈ నెల 20 నుంచి ఆందోళన లు చేపట్టి, ప్రభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 25 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సోందుమియా, నాగులు మీరా.