పునర్జన్మ ఇచ్చిన ఆశ్రమం.. మాతృదేవోభవ
Published: Wednesday March 24, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన న్యూస్; మతిస్థిమితం కోల్పోయిన యువకుడిని మాతృదేవోభవ ఆశ్రమం ఆధ్వర్యంలో చేరదీసి పునర్జన్మను కల్పించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ నాదర్గుల్ గ్రామంలో అనాధ ఆశ్రమ మాతృదేవోభవ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్, బి.ఎన్ రెడ్డి నగర్ పరిసరప్రాంతంలో రోడ్డుపై మాసిన బట్టలతో చెత్తకుండీలో పడవేసిన వ్యర్ధాలను తింటూ తిరుగుతున్నటువంటి వ్యక్తిని పేరు మనోజ్,వయస్సు దాదాపు 28 సం, లు స్థానికులు సమాచారం అందించడంతో మాతృదేవోభవ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి,ఆశ్రమ సిబ్బందితో కలిసి అతనిని చేరదీసి ఆ యువకుడికి పెరిగిన జుట్టు, గడ్డం తొలగించి స్నానం చేయించి నూతన వస్త్రాలను అదేవిధంగా పౌష్టికాహారం, వైద్యన్ని అందించి మాములు స్థితికి చేశారు. త్వరలోనే అతని కుటుంబ సభ్యుల వివరాలను కనుగొని వారి చెంతకు చేర్చుతాముని అన్నారు.
Share this on your social network: