ఆపద కాలంలో ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

Published: Tuesday June 22, 2021
పరిగి, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన బి యాదగిరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వారికి చికిత్స నిమిత్తం మూడు లక్షల రూపాయలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంజూరు చేయించిి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద రావు మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాదారం సర్పంచ్ బి రాములు పిఎ సి ఎస్ డైరెక్టర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.