సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
Published: Friday January 21, 2022
సిపిఎం కార్యదర్శి కుశన రాజన్న
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) సిపిఎం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుశన రాజన్న తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 22, 25, తేదీలలో రంగారెడ్డి జిల్లా తుర్క యాంజలో జరగబోయే మహాసభలకు సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్ బ్యూరో సభ్యుడు భి,వి,రాఘవులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్షక, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం సిపిఎం పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని పేదలపై జరిగే అన్యాయాలపై ప్రభుత్వ పక్షపాత వైఖరి పై, అండగా నిలుస్తుందని అనేక త్యాగాలు చేసిన చరిత్ర సిపిఎం పార్టీదే అన్నారు. ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి, ప్రభుత్వం అంబానీ లాంటి వాళ్లకు అమ్మేస్తున్నారని అన్నారు. ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న వైనం మనం అనుభవిస్తూన్నా మన్నారు. లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ఈ మహాసభలలో భవిష్యత్ పోరాటాలు రూపొందించుకోవడం జరుగుతుందని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, అల్లూరి లోకేష్ లు పాల్గొన్నారు.
Share this on your social network: