ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 20ప్రజాపాలన ప్రతినిది *రాందాస్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం*

Published: Wednesday December 21, 2022

ఇబ్రహీంపట్నం పరిధిలోని రాందాస్ పల్లి గ్రామములో పశువైద్య
మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యములో మంగళవారం ఉచిత పశు వైద్య శిశిరము నిర్వహించడం జరిగింది.
ఈ శిశిరము నందు 15  పశువులకు గల్ల కోశ వ్యాధులకు చికిత్స చేయడం జరిగింది. 35 పశువులకు సాదారణ చికిత్సలు, 14 పశువులకు చూడి నిర్థారణ పరీక్షలు చేయడం జరిగింది. 46 కోడెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, గొర్రెల కాపరరుల సంఘం అధ్యక్షుడు మల్లేష్  గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది డా|| పి.సురేందర్,కె. ప్ర సూన్. జే.వి., గోపాల పాత్ర జగర్, ప్రక్షణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచితంగా మందులు అందజేసిన వివిధ కంపెనీల ప్రతినిధులకు పశువైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలయజేసారు.