ప్రజాపాలన & స్నేహ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ తాసిల్దార్

Published: Wednesday January 04, 2023
బోనకల్, జనవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: ప్రజా పాలన & స్నేహ ఛానల్ తెలుగు దిన పత్రిక క్యాలెండర్ ను, మంగళవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ శ్వేత, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గుగులోత్ లక్ష్మణ్ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేలా పత్రికలు పనిచేయాలని, ప్రజల సమస్యలను వెలికితిస్తూ ప్రజాదరణ పొందాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పత్రికలు పనిచేయాలని, సమాజంలో పత్రికలు నాలుగో స్తంభం లాంటివని, ఇదే స్ఫూర్తితో మునుముందు ప్రజా పాలన తెలుగు దినపత్రిక ముందుకు సాగాలని, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు పత్రికల్లో చూపడంతో ప్రజల ఆదరణ పొందుతారని అదేవిధంగా ప్రజా సమస్యలను వెలికి తీసేదానిలో పాత్రికేయుల పాత్ర ఎంతో అవసరమని, ప్రజాపాలన దినపత్రిక ప్రజల మన్ననలు పొందుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సంగ్ శ్వేత, యు డి సి నాగలక్ష్మి, టైపిస్ట్ శ్రావణ్ కుమార్, వైయస్సార్ టిపి మండల నాయకులు ఇరుగు జ్ఞానేశ్, మండల కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.