బాలమోహన్ రెడ్డికి నివాళులర్పించిన కూచిపూడి

Published: Thursday August 04, 2022
తల్లాడ, ఆగస్టు 3 (ప్రజాపాలన న్యూస్)
 *తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన కర్నాటి బాలమోహన్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. బుధవారం ఆయన దశదినకర్మ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో నాయకులు మొక్క కృష్ణార్జున్, రావూరి రాంప్రసాద్, నారపోగు ప్రసాద్, రాయప్ప, తదితరులు ఉన్నారు.*
 
 
 
Attachments area