జిల్లా కలెక్టరేట్ మరియు జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే కందాళ...

Published: Thursday February 10, 2022
పాలేరు పిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు కలెక్టర్ వి.పి గౌతమ్ గారు మరియు జాయింట్ కలెక్టర్ మధుసూదన్ గారిని కలిసి నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామ నుండి వెళ్లే హైవే రోడ్డు విస్తరణలో భాగంగా భూములు ఇల్లు కోల్పోతున్న రైతులకు, ప్రజలకు అధిక మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని కొలతలు, చెట్లు, దేవాలయాలు, స్థూపాలు, ఆర్చి, కమ్యూనిటీ హాల్, చర్చ్ వీటన్నిటికీ సరైన కొలతలు తీసి నష్టపరిహారం ఇప్పించాలని, అండర్ పాస్ కాకుండా ఓపెన్ ప్లైవర్ కావాలని, టోల్ గెట్ దగ్గర భూములు కోల్పోతున్న రైతులకు అదనపు నష్టపరిహారం ఇప్పించాలని మరియు వెంకటగిరి, గుదిమళ్ళ గ్రామాల్లో కూడా హైవే వల్ల భూములు కోల్పోతున్న వారికి కూడా అధిక మొత్తంలో నష్టపరిహారం ఇప్పించాలని, గ్రామాలను సందర్శించి, ప్రజల కాస్త నష్టాలను తెలుసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేసిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి..