నిరుపేదలకు అండగా ఉంటున్న జెడ్పిటిసి ఉప్పల్ వెంకటేష్

Published: Monday September 19, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి.

రంగా రెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామములో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మితం అవుతున్న ఇల్లు నిర్మాణంలో భాగంగా ఆదివారం రోజున యదమ్మ ఇల్లు స్లాబ్ వేయడం జరిగింది. జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్  స్లాబ్ కు కావాల్సిన  స్టీల్, సిమెంట్  మెటీరియల్ అందజేయడం జరిగింది. యాదమ్మ కుటుంబ సభ్యులు జెడ్పీటీసీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి రఘుపతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.