దశావతారాల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Published: Tuesday January 03, 2023
బెల్లంపల్లి జనవరి 2 ప్రజా పాలన ప్రతినిధి: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి  సుభాష్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ, నూతన సంవత్సరములో ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం దేవాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన గరుత్మంతుని, కుబేరుని, మరియు దశావతారాల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బి, సుదర్శన్, స్థానిక కౌన్సిలర్లు సముద్రాల లావణ్య, రమేష్ , ఇతర కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ , ఆకెనపల్లి ఎంపీటీసీ సుభాష్ రావు , పి ఏ సి ఎస్, వైస్ చైర్మన్ రాజన్న , ఇతర ప్రజాప్రతినిధులు, బుగ్గ ఆలయ చైర్మన్ శ్రీదేవి, టిఆర్ఎస్ నాయకులు, ఎన్, శ్రీధర్, లక్ష్మణ్ , మురళి , శంకర్ , తదితరులు పాల్గొన్నారు.