ఇన్సూరెన్స్ చెక్కు అందించిన చైర్మన్ ప్రదీప్ రెడ్డి..

Published: Tuesday August 02, 2022
తల్లాడ, ఆగస్టు 1 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండల పరిధిలోని కుర్నవల్లి సొసైటీలో ఇన్సూరెన్స్  కలిగి ఉండి ఇటీవల మరణించిన గొర్రెపాటి తిరుపతిరావు కుటుంబానికి కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్  రెడ్డి సోమవారం 50 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఇన్సూరెన్స్  చెక్కును తిరుపతి రావు భార్య   వెంకట్రావమ్మకు  సొసైటీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో    లోన్ తీసుకున్న ప్రతి సభ్యుడికి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందన్నారు.  రైతులందరూ సొసైటీలో  లోన్ పొందటం ద్వారా ఇన్సూరెన్స్ కలిగి ఉండవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈవో   ఓగ్గు నరసింహారెడ్డి పాల్గొన్నారు.