నెడె గ్రీన్ ఇండియా చాలెంజ్ అవగాహన సదస్సు

Published: Thursday February 11, 2021
మండల అభివృద్ధి అధికారి సంజీవరావు
 
వెల్గటూర్, మార్చ్ 11 (ప్రజాపాలన): వెల్గటూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అమలుపై ఎం.పీ.పీ కూన మల్ల లక్ష్మీ లింగయ్య అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లుగా మండల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి సమావేశానికి జెడ్. పి.టి.సి.బి సుధారాణి రామస్వామి, మండల ఎం.పి.టి.సి లు, సర్పంచులు, సమస్త పంచాయతీ కార్యదర్శులకు గురువారం రోజు మధ్యాహ్నం 1 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అమలుపై ప్రత్యేక సమావేశ కార్యక్రమానికి హాజరు కావాలని యంపీడీవో ఒక ప్రకటనలో కోరారు.