కులం, మతం కన్నా గుణం మిన్న

Published: Wednesday April 12, 2023
: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజా పాలన : కులం మతం కన్నా గుణం మిన్న అనే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో నివాళులర్పించారు.
మహాత్మ పూలే జయంతి తో పాటు కస్తూర్బా గాంధీ జయంతి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.
పూలే, కస్తూర్బా గాంధీ చదువుకు ప్రాధాన్యత ఇస్తూ... అందరికి చదువు అందాలని ఎంతో... కృషి చేశారని పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కులం, మతం కన్నా గుణం గొప్పదని, అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.