వరద ప్రభావిత ప్రాంతంలో సర్వే .

Published: Tuesday November 08, 2022
 జన్నారం, నవంబర్ 07, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 110 ఇళ్లకు ఏ సి ఎం స్ప్రే కార్యకలాపాలను రేవేన్యూ మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వే నిర్వహించారు. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే జరుగుచున్నప్పుడు కార్తీక్ రావు హాజరై పూర్తి సమాచార వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలమడుగు సర్పంచి సర్పంచ్ నేరెళ్ల రాజన్న, వైస్ సర్పంచ్ స్వరూపరాణి, వార్డ్ మెంబర్లు ఎంపిటిసి వినోద్, పిఎస్, టి పోచయ్య హెచ్ఎ, సువర్ణాంద్ శైలజ, ఆశాస్, బి విజయలక్ష్మి, వాణి, వసంత, ఏ డబ్ల్యు టి విశ్వాస హెచ్ ఏ, గ్రామస్తులు, అశవర్కర్స్, తదితరులు పాల్గొన్నారు