కరోనా బాధితులకు 17వ రోజు అల్పాహారం. అందించిన నవీన్ రెడ్డి

Published: Monday June 21, 2021
మధిర, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రభుత్వ హాస్పటల్ లో కరోనా చికిత్స పొందుతున్న బాధితులకు 17వ రోజు కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డిఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు సాటి మనిషికి కరోనా టైంలో అల్పాహారాలు ఇచ్చట నా అదృష్టంగా భావిస్తూ భావిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమం మధిర శాసనసభ్యులు మల్లుభట్టి విక్రమార్క ఆదేశాల మేరకు చేయడం జరుగుతుందని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి తెలిపారు.