కరోనా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Tuesday March 30, 2021
జగిత్యాల, మర్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని 15వ వార్డుకు చెందిన బుడగజంగల కాలనిలో 15 మందికి కరోన పాజిటివ్ నిర్దారణకాగ స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వార్డును సందర్శించి కరోనా బాధితులను పరామర్శించారు. శానిటేషన్ కోవిడ్ మెడికల్ కిట్లను పంపిణీ చేసి ప్రత్యేకంగా పర్యవేక్షించిన అనంతరం వార్డ్ ప్రజలకు అవగాహన కలిపించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని అన్ని రకాల సదుపాయాల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది ఉంటే వెంటనే తెలియజేయాలని ప్రత్యేక వైద్య చికిత్సకు తరలిస్తామని పేర్కొన్నారు. కరోనాపట్ల ఆందోళన చెందకుండ మానసిక ధైర్యంతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ తిరుమల్లయ్య ప్రభుత్వ వైద్యులు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.