మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకలు

Published: Saturday May 22, 2021
జగిత్యాల, మే 21 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని బై పాస్ రోడ్డులో స్వర్గీయ భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 30వ వర్థంతిని పురస్కరించుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశంకోసం తమ ప్రాణాలను సైతం లేక్క చేయ్యకుండ దేశ ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. అనంతరం కరోనా నిబంధనాలు పాటిస్తూ కరోనా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండ శంకర్ కౌన్సిలర్స్ నక్క జీవన్ కల్లెపల్లి దుర్గయ్య గాజుల రాజేందర్ గుండ మధు కట్ట శివ రఘువీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.