ప్రమాదకరంగా మోరి-పట్టించుకోని ప్రజా ప్రతినిధులు శంకరపట్నం ఫిబ్రవరి 27 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Tuesday February 28, 2023
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నంలో ఎస్సీ బీసీ కాలనీ వద్ద మురికి కాలువ మోరి పై కప్పు లేకపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలోని ప్రజా ప్రతినిధులకు పంచాయతీ పాలకవర్గానికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వారు అలసత్వం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ప్రజాసంఘాల నాయకులు గ్రామపంచాయతీ పాలకవర్గంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇప్పటికైనా అధికారులు పాలకవర్గం స్పందించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Share this on your social network: