గీతాంజలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కార అవార్డులు

Published: Saturday March 20, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు  ఉత్తమ పురస్కారం అవార్డులు అతిథుల చేతుల మీదగా అందజేశారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ లో ఉన్న ఏ.పీ.ఆర్ గార్డెన్ లో గీతాంజలి లయన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం అవార్డులు గవర్నర్ పండిత పురోహిత గీతాంజలి లయన్ క్లబ్ ముఖ్య అతిథులు ఎస్ రాధాకృష్ణ, ఎస్. నరేంద్రబాబు, రమేష్ బాబు, ఎస్ ఆర్ వెంకటరెడ్డి వాళ్ల ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించి అవార్డులు అందజేశారు. అనంతరం గీతాంజలి లయన్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ..... కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇబ్బందులు పడిన, మరి విద్యార్థి విద్యార్థులకు చక్కటి ప్రణాళికతో ఆన్లైన్ క్లాసెస్ అదేవిధంగా బోధన విధానంలో కూడా విద్యార్థి విద్యార్థులకు బోధించే విధానమును పువ్వు పుట్టగానే పరిమళిస్తుందినీ చెప్పే ఉపాధ్యాయ, ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి లయన్ క్లబ్ అధ్యక్షులు సంపత్, జిఎస్ హరిబాబు, వెంకటేశ్వర్లు, బుచ్చిరెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్ లయన్ క్లబ్ మెంబర్స్ సిద్ధాల బీరప్ప, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, బొక్క రాజేందర్రెడ్డి, గీతాంజలి లైయన్ క్లబ్ మెంబెర్స్, టీచర్స్ బృందం ఉపాధ్యాయ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.