చిన్న పిల్లలకు న్యూమోనియా వాక్సిన్ ఇవ్వాలి

Published: Thursday September 02, 2021

మధిర, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లిలో న్యూమోనియా వాక్సిన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలు చల్లగా, సుభిక్షంగా ఉండాలనే మంచి సంకల్పంతో రాష్ట్రంలో చిన్న పిల్లందరికీ న్యూమోనియా రాకుండా ఉండటానికి పి సి పి వాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మధిర అభివృద్ధి ప్రదాత, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచనల మేరకు మధిర నియోజకవర్గం అంతా న్యూమోనియా రాకుండా ఉండాలన్న సదుద్దేశ్యంతో దెందుకూరు డా. పుష్పలత గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్-పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కమీషనర్ రమాదేవి నేత్రుత్వంలో మడుపల్లిలో ఈరోజు ఈ వాక్సిన్ కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్, తెరాస నాయకులు మేడికొండ కిరణ్, హరిజనవాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పారావు, ఏ ఎన్ ఎం సునీలా, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.