బి జె పి మండల కమిటీ నూతన నియమకాలు

Published: Thursday January 05, 2023

శంకరపట్నం జనవరి 04 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం  బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండల పాదాధికారుల సమావేశంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య నూతన సభ్యుల నియామకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిగా దాసరపు నరేందర్,  మండల ఉపాధ్యక్షులుగా గొట్టే మధు,  పిన్ రెడ్డి సంపత్ రెడ్డి లను నియమించినట్టు మండలాధ్యక్షుడు నియామక పత్రాలు అందజేశాడు. కొత్తగా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన మధు మాట్లాడుతూ బిజెపి పార్టీ బలోపేతానికి శాయశక్తుల కృషి చేస్తానని తన నియామకానికి సహకరించిన అధ్యక్షుడు చల్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.