కిలారి కృష్ణయ్య మృతి బాధాకరం జడ్పీటీసీ దిరిశాల ప్రమీల

Published: Tuesday March 07, 2023
తల్లాడ, మార్చి 6 (ప్రజాపాలన న్యూస్):
  తల్లాడ మండలంలోని ముద్దునూరు గ్రామపంచాయతీ పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన కీలారి వెంకటేశ్వర రావు తండ్రి కృష్ణయ్య ఇటీవల మరణించారు. సోమవారం ఆయన దశ దిన  కర్మ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కృష్ణయ్య మృతి బాధాకరమన్నారు. నివాళులర్పించిన వారిలో కలకోడిమ ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశా ల దాసురావు,  నాయకులు కట్టా రాము, భూపతి రావు, ముద్దనూరు రైతు సమన్వయ నాయకులు కిలారీ ప్రసాదు, కట్టా రవి తదితరులు ఉన్నారు.*