భాజపా నేతలు కమిషనర్ సుమన్ రావు కు వినతి
Published: Friday May 21, 2021
బాలపూర్, మే20, ప్రజాపాలన ప్రతినిధి : ట్రంక్ లైన్ త్వరగా పూర్తి చేయాలని, చెరువులలో వ్యర్థ పదార్థాలు చేరి దుర్వాసన వస్తున్నాయని బీజేపీ నేతలు కమిషనర్ కు వినతి. మీరు పేట మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి తో పాటు భాజపా నేతల ఆధ్వర్యంలో వచ్చే వర్షాకాలం వస్తునందు వలన సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ట్రంక్ లైన్ త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ సుమన్ రావు కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... పెద్ద చెరువు, మంత్రాల చెరువు, సంధ చెరువు లలో నీరు నిల్వ ఉండి, వ్యర్థ పదార్థాలు చేరి దుర్వాసన తో పాటు సీజనల్ వ్యాధులు వస్తాయని కాలనీ వాసులు అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. చుట్టుపక్కల నివాసముంటున్న కాలనీవాసులు అతి తొందరలో ట్రంక్ లైన్ సమస్యను పరిష్కరించాలని వివిధ డివిజన్ల కార్పొరేటర్ల తో మొరపెట్టుకున్నారని, కమిషనర్ కు వివరిస్తూ త్వరలో ఈ సమస్యను పరిష్కరించండిని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బిజెపి కార్పొరేటర్లు ఎం.కరుణానిధి, పసునూరి బిక్షపతి చారి, భీమ్ రాజ్, బిజెపి జి ఎస్ లు సోమేశ్వర్, జి మధు, బిజెపి నాయకులు సి. శ్రావణ్ కుమార్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: