టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నేడు చలో కలెక్టరేట్ ** టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు సాయిరాం

Published: Thursday September 22, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 21 (ప్రజాపాలన, ప్రతినిధి) : నేడు 22న టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ హాజరవుతున్నారని, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోల్కర్ సాయిరాం బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరుతూ నేడు 22 వ తేదీ గురువారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనివి జయవంతం చేయాలని పిలుపునిచ్చారు.