కోరుట్ల బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు
Published: Thursday June 10, 2021
కోరుట్ల, జూన్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ మెటుపల్లి మండలంలో పర్యటన సందర్భంగా కోరుట్ల పట్టణ బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి సారంగాపూర్ మండల పోలీస్ స్టేషన్ తరాలించడం జరిగినది. ప్రభుత్వ తప్పిదమైన కొండగట్టు ప్రమాదంలో చనిపోయిన బాధితులను పరమర్శించకపోగా కనీసం బాధిత కుటుంబాలకు న్యాయంగా అందవలసిన ప్రభుత్వ సహాయం కూడా అందకపోవడం విచారకరం. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం సహించని అధికార పార్టీ ఇలా అరెస్ట్ ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనం. జిల్లా నాయకులు ఇందూరి సత్యం, పీసరి నర్సయ్య, మాసం ప్రసాద్ పట్టణ మాజీ అధ్యక్షులు ఇందూరి తిరుమల వాసు సీనియర్ నాయకులు బండారి వెంకటి, గిన్నెల అశోక్, దామ రాజేష్, తోట దుర్గా ప్రసాద్, కొండబత్తిని అమర్ నాథ్, చాంద్ పాషా, మహేష్, పోతుగంటి శ్రీనివాస్, గిన్నెల శ్రీకాంత్, మడవేని నరేష్, రాజమురళి, బీజేవైఏం మహేష్, ప్రవీణ్ సింగ్ తదితరులు పాల్గొన్నరు.
Share this on your social network: