ముందస్తు అరెస్టులను ఖండించిన కసిరెడ్డి

Published: Wednesday March 17, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : భైంసాలో 4 సంవత్సరాల బాలికను రేప్ చేసిన సంఘటనలో కొన్ని హిందూ సంస్థలు డీజీపీ ఆఫీసు వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సందర్భంగా బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ నార్త్ ఇండియన్ సెల్ కన్వీనర్ రాజ్ జైశ్వాల్ ను, మంగళవారం నాడు మియాపూర్, నడిగడ్డ తాండాలోని ఆయన ఇంటివద్ద ముందస్తుగా అరెస్టు చేసారు. అనంతరం ఆయన్ని మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడపై బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి స్పందించారు. ఈ అక్రమంగా ముందస్తు అరెస్టులను ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో చిన్నారి బాలికపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించకపోగా, న్యాయం కోసం పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. అత్యాచారం ఘటనలో నిందితుడు ఎవరైనా వారిని శిక్షించేంతవరకు తమ పోరాటం ఆగదని కసిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేసారు.