పేదల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్ను ప్రారంభించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డ
Published: Saturday May 15, 2021
మేడిపల్లి, మే14 (ప్రజాపాలన ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజల ఆహారానికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉప్పల్ కార్పొరేటర్ మందుముళ్ళ రజిత పరమేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ను ఉప్పల్ గాంధీ బొమ్మ దగ్గర ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కాలంలో పేద ప్రజల ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జట్ట కిషోర్, అలుగల అనీల్ కుమార్, మంద మురళీ కృష్ణ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, జనగం రామకృష్ణ, అల్వాల భాస్కర్, ఢిల్లీ చెంద్ర శేఖర్ రెడ్డి, జిత్తు రెడ్డి, కన్నమైన నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: