తపాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ పోస్ట్ బ్యాంక్ బీమా శిబిరం

Published: Saturday November 05, 2022
 జన్నారం, నవంబర్ 04, ప్రజాపాలన:: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామంలోని ప్రజలకు గ్రామపంచాయతీ ఆవరణలో తపాల శాఖ అధ్వర్యంలో జాతీయ పోస్ట్ బ్యాంక్ మేనేజర్ వెంకటస్వామి, పొన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్ శుక్రవారం జరిగిన తపాల శాఖ బీమా పథకంపై 299, 399 రూపాయల ప్రమాద బీమా పథకం శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాల శాఖ ద్వారా చిన్నపిల్లల కోసం పొదుపు పథకాన్ని గ్రామంలోని తల్లిదండ్రలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తపాల శాఖ సేవలను అందరూ చక్కగా వాడుకోవాలని, సుకన్య సమృద్ది, ఆధార్ కార్డులు జారీ, జీవితభీమా, ప్రమాద జీవిత భీమా లాంటి అనేక రకాల సేవలను తపాల శాఖ అందిస్తుందన్నారు. ఈ భీమా పథకం ద్వారా తపాల శాఖ సేవల యొక్క ప్రాముఖ్యత పెరిగిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పోన్కల్ పోస్ట్ బ్రాంచ్ బిపిఎం వంగపల్లి శ్రీనివాస్, గ్రామస్తులు, దాసరి సత్యన్న, తదితరులు పాల్గొన్నారు.