కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి

Published: Friday September 03, 2021
మధిర, సెప్టెంబర్ 02, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 12 వ వర్ధంతి సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుచావా వేణు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. 2004లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో వైఎస్‌ సీఎం అయిన మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనాథలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. రైతులు అప్పుల కట్టలేక సహకార సంఘాలు దివాలా తీసే పరిస్థితిలో వైద్యనాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ.1,800 కోట్ల సాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు అని అన్నారు, రాజీవ్ ఆరోగ్రశ్రీ, మైనార్టీ వారికి 4 శాతం రిసర్వేషన్, 108 అంబులెన్స్ ఇలా ఎన్నో పథకాలతో ప్రజలకు ఆదర్శవంతంగా పాలించారు అని అన్నారు.... ఈ కార్యక్రమంలో.. మధిర మండల sc సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, నియోజకవర్గ యవజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డిమధిర మున్సిపల్ కౌన్సిలర్ లు కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వర రావు, సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు మండల బీసీ సెల్ అధ్యక్షులు  చెల్లి వేరు బుచ్చి రామయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, మండల అధ్యక్షుడు కోరంపల్లి చంటి, మండల గాంధి పదం అధ్యక్షుడు బోడెపూడి గోపి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు  దుంపవెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ intuc అధ్యక్షుడు ల్ బాజి, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ నాయకులు, షేక్ మోహమ్మద్ అలీ, కర్రి వేద రాంబాబు  సూర్యదేవర కోటేశ్వరరావు, బానోతు రమణ, మువ్వా వెంకయ్య బాబు, తిరువీధుల వెంకటేశ్వర్లు అల్లాడి గోపాల్ రావు, ఆదిములం శ్రీనివాస్ రావు, ప్రదీప్ మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు.