పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తాం
Published: Wednesday February 15, 2023
* వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో కెరెల్లి గ్రామానికి చెందిన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తలారి శ్రీనివాస్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అతని అనుచరులు ప్రవీణ్, వినోద్, నరేష్, మురళి, ప్రశాంత్, నరేష్, మహేష్ కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
Share this on your social network: